దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అర్హులైన ఖైదీలను విడుదల చేసే చర్యలలో భాగంగా ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఏ భారతి గారి ఆధ్వర్యంలో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఐఏఎస్ గారు, బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు, ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యామ్ బాబు, జిల్లా జైలు అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.