హైదరాబాద్ లో 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు
హైదరాబాద్: నిర్వహణ సమస్యల కారణంగా ఆదివారం 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-ఫలక్ నుమా రూట్లో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి రూట్లో 9 సర్వీసులు, ఫలక్నుమా- లింగంపల్లి రూట్లో 7, లింగంపల్లి ఫలక్నుమా రూట్ 7, సికింద్రాబాద్- లింగంపల్లి రూట్లో ఒక్క సర్వీసు, లింగంపల్లి- సికింద్రాబాద్ రూట్లో ఒక్క సర్వీసు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.