ఇటీవల ఛతీస్గఢ్ వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. సుమారు ఐదు నెలల కిందట ఓ 30 ఏళ్ల యువకుడు బైక్ యాక్సిడెంట్కు గురయ్యాడు. హెల్మెట్ లేకపోవడంతో అతడి కంటి కింద తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ సమయంలో డాక్టర్లు గాయాలైన చోట కుట్లు వేసి పంపించారు. అయితే అది కాస్తా బెడిసికొట్టింది.
కుడి కంటి కింద గాయానికి చీము రావడం మొదలైంది. తీవ్రమైన నొప్పి కూడా వస్తుండటంతో అతడు మరోసారి చికిత్స నిమిత్తం డాక్టర్లను సంప్రదించాడు. వైద్యులు సీటీ స్కాన్ నిర్వహించగా.. అతడి కంటి కింద సుమారు 4 అంగుళాల పొడవున్న పుల్లలను గుర్తించారు. గంటన్నర పాటు ఆపరేషన్ చేసి.. వాటిని బయటికి తీశారు. బాధితుడి ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు.