స్థానిక వెంగముక్కపాలెం నందు గల క్విస్ కాలేజ్ అఫ్ ఫార్మసీ ఏన్ ఎస్ ఎస్ మరియు స్టెప్ ఒంగోలు వారి బాగస్వామియముతో వాలంటీర్లు ,ఆజాద్ క అమృత్ మహోత్సవము లో భాగముగా మరియు అంతర్ జాతీయ యువజన మహోత్సవము సందర్భముగా రక్త దానము నిర్వహించారు అని దాదాపు 32 యూనిట్ల బ్లడ్ ను స్థానిక గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ బ్లడ్ బ్యాంకు కు దానము చేసారు అని ప్రెసిడెంట్ శ్రీ నిడమానూరి నాగేశ్వరరావు గారు తెలియజేశారు . ఈ కార్యక్రమము లో భాగముగా బి . బాబురావు గారు , స్టెప్ , సీఈఓ , ఆర్ వీ ఎస్ కృష్ణమోహన్ సూపరెండెంట్ స్టెప్ , డి . సుబ్బారావు, సిబ్బంది మరియు ఉపాధ్యాయిని , ఉపాధ్యాయాలు విద్యార్థులు పాల్గొన్నారు అని కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి గారు తెలిపారు , కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి ధాక్షినామూర్తి ,గారు మాట్లాడుతూ రక్త దానం పుణ్య కార్యక్రమం అని 18 ఇయర్స్ నిండిన ప్రతి విద్యార్థి దానం చేయవచ్చని కొని ఆడారు అలాగే క్విస్ సెట్ ప్రిన్సిపాల్ డాక్టర్ హన్మంతరావు గారు మాట్లాడుతూ “ప్రాణం అంతా రక్తం లోనే ఉంది..రక్త దానం చేసి ప్రాణ దాతలుకండి అని ” విద్యార్థులు లకు తెలియజేసారు .
ఈ కార్యక్రమము లో ముఖ్య అతిధిగా పాల్గొన్న బి . బాబురావు గారు , స్టెప్ , సీఈఓ గారు మాట్లాడుతూ “మీరు దానం చేసే రకపు బొట్లు..వేరొకరి జీవితంలో సముద్రమంత సంతోషాన్ని నింపుతాయి” అని కొనియాడారు ఈ కార్యక్రమము లో గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు .