- సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టీస్ గా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపిక.
- సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్
- దీంతో ఆయన పేరును ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు.
- ఈ నెల 26వ తేదీన సీజేఐగా పదవీ విరమణ చేయనున్న ఎన్వీ రమణ.
- జస్టిస్ లలిత్ భారత 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.
- అయితే ఆయన పదవీకాలం నవంబర్ 8 వరకే ఉంది.
- సీజేఐగా రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు.
- ప్రస్తుతం యూయూ లలిత్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.
- న్యాయమూర్తి కంటే ముందు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
- జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6 వ సీనియర్ న్యాయవాది.