రెండు తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలతో పాటు పై నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 897.20 అడుగుల వరకు నీళ్లు పుష్కలంగా ఉండగా.. నాగార్జునసాగర్లో 590 అడుగులకు 554.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలతో పాటు పై నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 897.20 అడుగుల వరకు నీళ్లు పుష్కలంగా ఉండగా నాగార్జునసాగర్లో 590 అడుగులకు 554.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది.
నాగర్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పై నుంచి ప్రాజెక్టులోకి 44,769 క్యూసెక్కుల వరద చేరుతుందని.. జలాశయం నుంచి 3,244 క్యూసెక్కుల వరద దిగువకి వెళ్తుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 554.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది.
మరోవైపు.. శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 1,06,750 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 43,492 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో 215.80 టీఎంసీ నీటిని నిల్వ చేయొచ్చనగా.. ప్రస్తుతం 183.84 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం నుంచి వరద కొనసాగుతుండగా.. అక్కడి నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద చేరనుంది.