IND vs WI 4th T20 వెస్టిండీస్ని టీ20 సిరీస్లోనూ టీమిండియా ఆడుకుంటోంది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా శనివారం అర్ధరాత్రి ముగిసిన నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్లోనూ రాణించిన భారత్ జట్టు 59 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దాంతో.. ఐదు టీ20ల సిరీస్ని కూడా భారత్ జట్టు ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది. ఇక నామమాత్రమైన ఆఖరి టీ20 మ్యాచ్ ఫ్లోరిడా వేదికగానే ఆదివారం రాత్రి 8 గంటలకి ప్రారంభంకానుంది.