తిరుపతికి చెందిన జయచంద్రారెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమార్తె హర్షవి బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని బోస్టన్ మహా నగరంలోని అత్హెనా హెల్త్ అనే సంస్థలో ఉద్యోగంలో చేరింది. అదే సంస్థలో జనరల్ మేనేజర్గా పని చేస్తున్న అమెరికాకు చేందిన డామియన్ ఫ్రాంక్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమికులుగా కొద్ది కాలం పాటు గడిపిన వీరు.. జీవితాంతం కలిసే ఉండాలని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పి ఒప్పించారు. వివాహ వేడుకను ముందుగా అమెరికాలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ, కుమార్తె తల్లిదండ్రులు, బంధువుల కోరిక మేరకు తిరుపతిలోని ఓ హోటల్లో గురువారం రాత్రి వివాహం ఘనంగా జరిపారు.
ఈ వివాహానికి పెళ్ళి కుమారుడు తండ్రి స్కాట్ బుషార్డ్, తల్లి అన్నా బుషార్డ్, పెళ్ళి కుమారుడి తమ్ముడు, అతని భార్య హాజరయ్యారు. ఇక అందరి సమక్షంలో అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం కన్నుల పండువగా జరిగింది.