ఆంధ్రప్రదేశ్ పదోతరగతి 2022 సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి:
విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (AP SSC Supplementary Results 2022) ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు (AP SSC Exams 2022) నిర్వహించిన సంగతి తెలిసిందే. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలను నిర్వహించలేదు. ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో అనుకున్న దానికన్నా కూడా తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ ద్వారా మరోసారి ఎగ్జామ్ రాసే అవకాశం లభించింది. ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు చుడండి ఇలా:
Step 1- ముందుగా https://www.bse.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 3- హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
Step 4- ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
Step 5- ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు.
- ఆంధ్రప్రదేశ్లో ఈసారి పదోతరగతి ఫలితాల్లో గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు జరిగిన పదో తరగతి రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 6,22,537 విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు హాజరైనవారిలో 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు.
- ఫలితాల్లో మొత్తం 67.26 శాతం ఉతీర్ణత నమోదైంది. పదో తరగతి రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 11751 స్కూళ్లకు చెందిన విద్యార్థులు హాజరుకాగా వీటిలో 797 పాఠశాలల్లో నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 71 స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వీరికి జూలై 6 నుంచి 15 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్కు 2,01,627ల మంది విద్యార్ధులు హాజరయ్యారు.